Friday, March 29, 2024

ఎంజిఎంలో కరోనా మృతదేహాలు తారుమారు…

వ‌రంగ‌ల్ – ఎంజిఎం హాస్ప‌ట‌ల్ సిబ్బంది నిర్ల‌క్ష్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.. ఈ సారి క‌రోనా మృత దేహాల‌ను మార్చివేశారు.. ఒక‌రి మృత‌దేహం బ‌దులు మ‌రో మృత‌దేహం ఇచ్చేశారు.. కాగా ఎంజిఎంలో ఇటీవ‌ల క‌రోనాతో ఒక మ‌హిళ చేరింది..చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందింది.. ఆ త‌ర్వాత బంధువుల‌కు అంత్య‌క్రియ‌ల కోసం మృత‌దేహం అప్ప‌గించారు.. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం మృత‌దేహాన్ని నేరుగా స్మ‌శాన వాటిక‌కు పంపారు.. అక్క‌డికి చేరుకున్న బంధువులు షాక్ అయ్యారు.. మ‌హిళ మృత‌దేహం బ‌దులు పురుషుడి మృత‌దేహం ఉండ‌టంతో కంగుతిన్నారు. దీంతో తిరిగి మృత‌దేహంతో ఎంజిఎం హాస్ప‌ట‌ల్ కు బంధువులు చేరుకున్నారు. ఎంజీఎం అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. మ‌హిళ మృత‌దేహం అప్ప‌గించేందుకు ఎంజిఎం సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement