Thursday, April 25, 2024

పీఆర్‌సీ ప్రకారం వేతనాలు..

బెల్లంపల్లి : పీఆర్‌సీ కమీషన్‌ విడుదల చేసిన మినిమమ్‌ బేసిక్స్‌ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు వర్తింపజేసి వేతనాలను చెల్లించాలని సీఐటీయూ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని మున్సిపాలిటీల కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు వెంటనే 11వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలను చెల్లించాలని, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎస్‌.కె.యాకుబ్‌, కార్యదర్శి గొడిసెల చంద్రమౌళి, పట్టణ అధ్యక్షుడు కమల్‌, పట్టణ కార్యదర్శి సుమన్‌, రాజమౌళి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement