Saturday, May 4, 2024

ఆంజనేయ స్వామి ఆలయ ప్రాణ ప్ర‌తిష్ఠ మ‌హోత్స‌వం..

కుంటాల : మండలంలోని లింబ(కే) గ్రామంలో జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి నూతన ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముధోల్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పవార్ రామారావు పాటిల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ వారు, గ్రామస్తులు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా శాలువాతో సన్మానించడం జరిగింది. వీరితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కుంటాల మండల ఎంపీపీ గజ్జారం, వైస్ ఎంపీపీ నవీన్, ఓల మాజీ సర్పంచ్ గజ్జరం, లింబా(బి) మాజీ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ దేవిదాస్ పటేల్, వెంగల్ రావు, రమణారావు, అశోక్ లడ్డ, గిరి రాజ్, పల్సీ రాజన్న, డాక్టర్ అశోక్, బాజిరెడ్డి, మల్లేష్, విట్టల్, శంకర్, సాయన్న ఆది రాజన్న, మేల్ల సాయి, శ్రీనివాస్, సాయి కుమార్, నరేష్, మల్లారెడ్డి, గంగాధర్ పటేల్, విజయ్, వినోద్ రెడ్డి, గంగయ్య, ఆల్ద భోజన్న, సూర్యాపూర్ రాజన్న, దేవిదాస్, మల్లేష్,దాసరి సాయన్న తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement