Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ పార్టీకి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ రాజీనామా..

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 13 (ప్రభ న్యూస్) : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ తన ఛాంబర్ లో ప్రకటించారు.

తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖను పంపనున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దీంతో నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగలనున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement