Wednesday, May 1, 2024

Nirmal: నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్ దాడి..

నిర్మల్ : నిద్రిస్తున్న వ్యక్తిపై దుండగుడు యాసిడ్ తో దాడి చేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడ గ్రామనికి చెందిన గడపాలే మోహన్ తన ఇంటి స్లాబ్ పై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి స‌మ‌యంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి యాసిడ్ తో దాడిచేసాడు.

దీంతో మోహన్ అరవడంతో కుటుంబీకులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మోహన్ ను హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై యాసిడ్ పడడంతో ముఖంతో పాటు శరీరంలో కొంత భాగం కాలింది. ఈ సంఘటన జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement