Sunday, April 28, 2024

ముంపు భూముల పరిశీలన

కాసిపేట : మందమర్రి ఏరియా కల్యాణిఖని ఉపరితలగనిలో ముంపునకు గురవుతున్న భూములను అధికారులు పరిశీలించారు. కాసిపేట శివారులోని సర్వే నం146,147లోనిదాదాపు రెండు వందల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డ్‌ లను అధికారులు పరిశీలించారు. త్వరలోనే ముంపు భూములకు చెందిన పరిహారం సంబంధిత రైతులకు అందించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జియం చింతల శ్రీనివాస్‌, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల, తహశిల్దార్‌ భూమేశ్వర్‌ , అధికారులు, రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement