Saturday, May 4, 2024

Nirmal: బీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామాలు…

దస్తూరాబాద్, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని మున్యాల గ్రామంలోని రైతు బంధు సమితి మండల అధ్యక్షులు సిర్ప సంతోష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి 200మంది కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు మంగళవారం జగదాంబ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించడంలో పార్టీ విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజీనామాలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో తెలుపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement