Monday, April 29, 2024

జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం..

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ పేరుతో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద రెండవ వారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని, దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించామన్నారు. అన్నదాత చకినారపు రాణి-గణపతి దంపతులు, నిరుపేదలు, యాచకుల, బాటసారుల, కూలీల ఆకలిని తీర్చేందుకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జనహిత అన్నపూర్ణ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతీ వారం దాతలు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శులు జక్కుల శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి రంజీత్‌గౌడ్‌, ఎంజాల కుమార్‌, గౌరవ సలహాదారులు మురుకూరి బాలాజీ, కార్యవర్గ సభ్యులు నిచ్చకోల గురుమూర్తి, గడ్డం రజినీకాంత్‌గౌడ్‌, బానోతు విజయ్‌కుమార్‌, ఆడె సురేందర్‌, కామెర వెంకటస్వామి, పూదరి నగేష్‌గౌడ్‌, గాజుల కైలాష్‌, పెద్ది వినయ్‌కుమార్‌, మామిడి దినేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement