Monday, May 6, 2024

IIIT : బాస‌ర ట్రిపుల్ ఐటీ వద్ద భారీ బందోబస్తు

బాసర, ప్ర‌భ న్యూస్ : గత రెండు రోజుల నుండి వరుస ఆత్మహత్య ఘటనలు జిల్లా కేంద్రంలో అందరినీ కుదిపేస్తుంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్ట‌డికి ప్రయత్నించిన భాజపా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఇతర నాయకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో పాటు ఇతర భాజపా నాయకులను అరెస్టు చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement