Saturday, May 4, 2024

చేపల వేటకు వెళ్లి వ్య‌క్తి మృతి.. నిర్మ‌ల్ జిల్లాలో ఘ‌ట‌న‌

నిర్మల్ జిల్లాలో చేప‌ల వేట‌కు వెళ్లి ఒక‌రు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (సోమ‌వారం) పెంబి మండలం మందపల్లిలో వెలుగులోకి వ‌చ్చింది. గ్రామానికి చెందిన కొండ్రా నర్సయ్య (65) నిన్న (ఆదివారం) మధ్యాహ్నం గ్రామంలో ఉన్న చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ వెతుకగా ప్రమాదవాషత్తు చనిపోయాడని అయన తమ్ముడు రాములు ఫిర్యాదు చేశాడు. ఆ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రజనీకాంత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement