Thursday, May 2, 2024

‘కేసీఆర్’‌ చిత్రపటానికి పాలాభిషేకం

బెల్లంపల్లి : గొర్రెల పంపిణీని త్వరలో చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ దృష్టికి తీసుకువెళ్లారు పలువురు గ్రామస్థులు.కాగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడగా వారం రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని టిఆర్ ఎస్ ఇంచార్జి బడికల సంపత్‌కుమార్‌, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్‌ యాదవ్‌లు తెలిపారు. గొర్రెల పంపిణీ విషయంలో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గొర్రెల పంపిణీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.రామలింగంయ్య, ఎం.గణేష్‌, ఎన్‌.నరేష్‌, శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement