Monday, April 29, 2024

Adilabad – ఆటో – లారీ ఢీ – నలుగురు దుర్మరణం

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించారు. శాంతినగర్‌కు చెందిన పదిమంది ఆటోలో ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement