Sunday, May 5, 2024

కార్యకర్తలే పార్టీకి బలం.. ఎన్నిక ఏదైనా TRS దే గెలుపు : ఎమ్మెల్యే దాసరి

కార్యకర్తలే తెలంగాణ రాష్ట్ర సమితికి అసలైన బలమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండల తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఏ పార్టీకి లేనంత బలమైన కార్యకర్తలు తెరాసకు మాత్రమే ఉన్నారన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చర్చించవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పరుస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఎందరో కార్యకర్తలు ఎన్నికల సమయంలో అన్ని పనులు వదులుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేశారని అటువంటి వారిని ఎప్పుడూ మర్చిపోమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, లతోపాటు కార్యకర్తల బలం అధికంగా ఉండడం వల్ల ఎన్నిక ఏదైనా తెరాసాదే గెలుపు అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement