Sunday, April 28, 2024

Breaking: మూడు రోజుల్లో పెళ్లి, శుభ‌లేఖ‌లు పంచుతుండ‌గా యాక్సిడెంట్..

వాళ్లింట్లో పెళ్లి పెట్టుకున్నారు. త‌న కుమారుడి పెళ్లికి చుట్టాలంద‌రినీ ఆహ్వానించి సంబురంగా పెళ్లి చేయాల‌నుకున్నాడు. బంధువుల‌కు శుభ‌లేఖ‌లు పంచే ప‌నిపెట్టుకున్నాడు. కానీ, ఈలోపే మ‌రో మూడు రోజుల్లో పెళ్లి అన‌గా ఇవ్వాల (ఆదివారం) ఆ ఇంటిపెద్ద యాక్సిడెంట్‌లో చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బుబాబాద్ జిల్లాలో జ‌రిగింది.

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం సోమరం గ్రామం వ‌ద్ద‌ భూక్య ఇండియా అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొని చ‌నిపోయాడు. ఇత‌ను కేసముద్రం మండల చంద్రు తండా వాసిగా తెలుస్తోంది. అత‌ని కొడుకు పెండ్లి కోసం శుభ‌లేఖ‌లు పంచుతున్న క్ర‌మంలో సోమరం ప‌క్క‌న ఉన్న తండాలో వారి బంధువులకు ఇచ్చి వెళుతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మూడు రోజుల్లో పెళ్లి జరిగే ఆ ఇంట్లో ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో విషాదం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement