Friday, March 29, 2024

గుంటూరులో పర్యటించిన రాష్ట్ర గవర్నర్..

గుంటూరు జిల్లాలో గవర్నర్ పర్యటించనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వారంరోజుల ముందునుంచే, గవర్నర్ జిల్లాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయన కార్యక్రమం ముగించే వరకు, మినిట్ మినిట్ పిన్ పాయింట్ టార్గెట్ చేసుకుని, స్వయంగా జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ పర్యటించనున్న సాయి భాస్కర్ హాస్పిటల్ ను గత రెండురోజుల నుంచి జాగిలాల తనిఖీ, బాంబ్ స్క్వాడ్ తనిఖీలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి, పోలీసుల కనుసన్నల్లోకి హాస్పిటల్ ను తీసుకున్నారు. ఆదివారం గవర్నర్ గుంటూరు సాయి భాస్కర్ హాస్పటల్ వచ్చిన దగ్గర నుంచి, ఆయన కార్యక్రమం ముగిసే వరకు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గవర్నర్ పక్కనే ఉన్నారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, వెస్ట్ ఏఎస్పీ సుప్రజ గవర్నర్ తో సెల్ఫీ దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement