Friday, April 26, 2024

శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడి దుర్మరణం

చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సోమనపల్లి ఫకీర్ కుమార్ ఓ ప్రమాదంలో ఇవ్వాల చ‌నిపోయారు. పాల్వంచలో ఉదయం జరిగిన ఒక వివాహ శుభ కార్యానికి సోదరుడు నాగులుతో ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా తిప్పనపల్లి బ్రిడ్జి వద్ద యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయలపాలయ్యారు. క్షత గాత్రులను కొత్తగూడెం తరలించారు. ఈ లోపే పకీరకుమార్ చ‌నిపోయారు.

విషయం తెలుసుకున్న చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ కొనకళ్ల వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆస్ప‌త్రికి చేరుకొని పకీర్ కుమార్ మృత దేహాన్ని సందర్శించి నివాళుల‌ర్పించారు. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. పకీర్ మృతి పట్ల నాయకులు సురేష్, షాబీర్ హుస్సేయిన్, కృష్ణా రెడ్డి, రత్నాకర్, బాబు, పలువురు మిత్రులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement