Friday, April 19, 2024

కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్ష.. ల్యాండ్ ఇష్యూలో జాప్యమే కార‌ణం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ తహసీల్దార్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మండలంలోని కొత్తకోటలో భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఎమ్మార్వో రైతు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆ రైతు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎమ్మార్వో ఆ పని చేయలేదు. దీంతో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఎమ్మార్వోకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement