Sunday, April 28, 2024

Accident – చెట్టును ఢీకొన్న కారు – ఇద్దరు యువకుల దుర్మరణం

మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది..

ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ నుంచి కారులో మారేడుమిల్లికి విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వెంగళదాసు సాయిరాం, రవితేజగా గుర్తించారు. సంగినేని సాయిరాం, లక్ష్మణ్, సాయితేజకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement