Sunday, May 5, 2024

యాదాద్రి జిల్లాలో యాక్సిడెంట్‌, ఇద్ద‌రు మృతి.. బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ద‌గ్గ‌ర యాక్సిడెంట్ జ‌రిగింది. తూప్రాన్​పేట శివారులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనానికి మరమ్మతు చేస్తుండగా అటుగా వస్తున్న కంటైనర్​ ఈ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘనటలో డీసీఎం వాహనాన్ని రిపేర్‌ చేస్తున్న ముగ్గురిలో ఇద్దరు చ‌నిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే.. బస్సును ఓవర్ టేక్ చేయబోయి రోడ్డుపై ఉన్న ముగ్గురిని కంటైనర్ లారీ ఢీ కొట్టిన‌ట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement