Saturday, April 27, 2024

TS: భ‌ర్త‌ను క‌ట్టేసి కొట్టి చంపిన భార్య..

కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. తరచూ గొడవ చేస్తున్నాడనే కోపంతో ఈ హ‌త్య‌కు పాల్పడింది.. వివరాల‌లోకి వెళితే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న రోహితి త‌న భ‌ర్త‌ హేమంత్ తో క‌ల‌సి ఇక్క‌డ ఉంటున్న‌ది..

భ‌ర్త రోజు తాగివ‌చ్చి ఇంటిలో గొడ‌వ చేస్తుండ‌టంతో భ‌రించ‌లేని భార్య పడుకున్న భర్తను తాళ్ల‌తో మంచానికి క‌ట్టివేసింది.. త‌ర్వాత అత‌డి పై వేడి నీళ్ళు పోసింది.… అనంతరం క‌ర్ర‌తో చిత‌క్కొట్టింది.. దీంతో తీవ్రగాయాలు కావ‌డంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించారు.. అక్క‌డే హేమంత్ చికిత్స పొందుతూ ఇవాళ ఉద‌యం మృతిచెందాడు. 3 టౌన్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement