Sunday, May 5, 2024

MDK: కువైట్ లో నందిగామ గ్రామ వాసి మృతి..

నిజాంపేట, డిసెంబర్ 14 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన పాపయ్య గారి బాబు (30) గల్ఫ్ దేశం కువైట్ లో గత ఏడు సంవత్సరాలుగా కోకో కోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పాపయ్య గారి బాబు, కువైట్ దేశంలో కోక కోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

గత కొద్ది రోజులుగా అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో బాత్రూంలో జారిపడి మృతిచెందాడని అక్కడి వైద్యులు బుధవారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మృతునికి భార్య మనుశ్రీ, 4 సంవత్సరాల లోపు ముగ్గురు కుమారులున్నారు. బాబు మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement