Sunday, April 28, 2024

ఆర్థిక ఇబ్బందుల‌తో ఉరి వేసుకొని.. వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందుల‌తో ఓ వ్య‌క్తి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డాడు. కాగా ఈ ఘ‌ట‌న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ పల్లిలో చోటు చేసుకుంది. నర్సింహ తండ్రి యాదయ్య వయస్సు 38 సంవత్సరాలు.. ఉరి వేసుకుని చనిపోయాడు.ఈ మేర‌కు స్థానికులు పోలీసుల‌కి స‌మాచారం తెలియ‌జేశారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. కాగా అతడు ఉరి వేసుకుని చనిపోవడానికి కారణాలు ఆర్థిక ఇబ్బందులేనని ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement