Thursday, May 16, 2024

సిగరెట్ కోసం గొడవ.. ఒకరు మృతి

ఇద్దరు వ్యక్తుల మధ్య సిగరెట్ కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితులు సిగరెట్ తాగడానికి వెళ్లి సిగరెట్ కోసం ఇద్దరూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గొడవ కాస్త తారా స్థాయికి చేరింది. దీంతో సందీప్ అనే వ్యక్తిని సాయి అనే వ్యక్తి సిమెంట్ ఇటుకతో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement