Tuesday, May 21, 2024

Big Breaking | వీధికుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. చికిత్స పొందుతూ మృతి

వరంగల్​లో వీధికుక్కలు మరో బాలుడిని బలితీసుకున్నాయి. వరంగల్​లోని కొత్తపల్లిలో 15 రోజుల క్రితం బాలుడిపై కుక్కలు దాడిచేశాయి. వెంటనే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ 18నెలల బాలుడు రాజ్​ ఇవ్వాల (బుధవారం) చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై చాలామంది తీవ్రంగా రెస్పాండ్​ అవుతున్నారు. పిల్లల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఇక.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ కుక్కల బెడద విపరీతంగా ఉంది. పలు చోట్ల మందలు మందలుగా కుక్కలు తిరుగుతూ బైకులమీద వెళ్లే వారిని, పాదచారులపై అటాక్​ చేస్తున్న ఘటనలున్నాయి. హైదరాబాద్​ సిటీలో కూడా వీధి కుక్కల బెడద ఎక్కువగానే ఉంది. జీహెచ్​ఎంసీ ఇచ్చిన స్పెషల్​ కాల్​ సెంటర్​కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పిల్లల ప్రాణాలు పోతుంటే అశ్రద్ధగా ఉండడం ప్రభుత్వానికి, అధికారులకు తగదని చాలామంది కామెంట్స్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement