Sunday, April 28, 2024

TS: వరికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలి.. మాజీ మంత్రి వేముల

వేల్పూరు, ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : వ‌రికి క్వింటాల్ కు అద‌నంగా రూ.500 బోన‌స్ ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట పట్టారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరికి క్వింటాలుకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement