Monday, April 29, 2024

TS: 8వ తరగతి విద్యార్థి పై కుక్కల దాడి…తీవ్ర గాయాలు

గద్వాల ప్రతినిధి,ఫిబ్రవరి 14 (ప్రభ న్యూస్): గద్వాల పురపాలక సంఘం పరిధిలోని 30వ వార్డు సుంకులమ్మ మెట్టు కాలనీలో నివాసం ఉంటున్న పద్మ వెంకటేష్ కుమారుడు కిరణ్ తేజ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి పై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఉదయము ఎనిమిదిన్నర గంటల సమయంలో ఇంటిముందు ఉండగా అకస్మాత్తుగా ఐదు కుక్కలు ఒకటేసారి కరవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

గద్వాల పురపాలక సంఘం పరిధిలోని పలు సందర్భాల్లో చిన్నారులపై, పెద్దలపై కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్మన్ కు కంప్లైంట్ చేయగా ప్రత్యేకంగా కుక్కలు పట్టే బృందాన్ని తీసుకువచ్చి కొన్నిచోట్ల సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా గద్వాల పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ఎక్కువగా కుక్కల బెడద ఉన్నచోట అన్ని కుక్కలను పట్టుకుపోయే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు మున్సిపల్ చైర్మన్ కు పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement