Monday, April 29, 2024

ఘనంగా సీఆర్పీఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకలు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ సీఆర్పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌లో 83వ రైజింగ్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సదరన్‌ సెక్టార్‌ ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్డా అమరజవాన్లకు నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బలగాలకు శుభాకాంక్షలు తెలిపారు. 83 సంవత్సరాల కిందట మధ్యప్రదేశ్‌లో సీఆర్పీఎఫ్‌ ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడులక్షలకుపైగా జవాన్లు ఉన్నారని తెలిపారు. అంతర్గత భద్రతని కాపాడేందుకు సీఆర్పీఎఫ్‌ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. దేశ రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో హరితక్రాంతి పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement