Monday, April 29, 2024

TS: జువెనైల్‌ హోమ్ నుంచి 8మంది చిన్నారులు పరార్…

జువైనల్ హోమ్ నుంచి ఎనిమిది మంది చిన్నారులు ప‌రారైన ఘ‌ట‌న‌ కలకలం రేపింది. హైదరాబాద్ సూరారం పరిధిలోని కైసర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. న‌లుగురు 15నుండి 18 ఏళ్లలోపు బాలనేరస్తులు.. మ‌రో న‌లుగురు పాతబస్తీకి చెందిన బాలనేరస్థులుగా గుర్తించారు.

నిన్న రాత్రి సమయంలో జువైనల్ హోంలో అలజడి సృష్టించి గ్రిల్స్ విరగొట్టిన పాతబస్తీకి చెందిన బాలనేరస్తులు.. పిల్లల ఆచూకీ లభించకపోవడంతో నిర్వహాకులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తప్పించుకుపోయిన పిల్లలు ఎటువైపు వెళ్లారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement