Saturday, May 4, 2024

BREKING NEWS : రూ. 50 లక్షల పట్టివేత..చెన్నూరు తరలిస్తుండగా పోలీసుల అదుపులో ఇద్దరు..

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్రమంగా తరలిస్తున్న 50 లక్షల రూపాయలకు రూపాయలను ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై 50 లక్షల రూపాయలు తరలిస్తుండగా పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన కంజుల రవి కిషోర్, హైదరాబాద్ కు చెందిన మధుగంటి ప్రేమ్ కుమార్ లు ద్విచక్ర వాహనంపై చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ కు అందించేందుకు 50 లక్షల రూపాయలు తీసుకువెళ్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 50 లక్షలు రూపాయలు ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement