Friday, May 3, 2024

ప‌రేడ్ గ్రౌండ్ వ‌ద్ద ఫ్లెక్సీల క‌లక‌లం- గోవా విమోచ‌న దినోత్స‌వానికి రూ.300కోట్లు..మ‌రి తెలంగాణ విమోచ‌న దినోత్స‌వానికి !

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో ఫ్లెక్సీల క‌ల‌క‌లం రేగింది. గోవా విమోచన దినోత్సవానికి రూ. 300 కోట్లు ఇచ్చిన అమిత్ షా.. తెలంగాణకు ఏమైనా ఇస్తారా అని ప్లెక్సీలో ప్రశ్నించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏమైనా ప్రకటన చేస్తారా అంటూ ప్లెక్సీలో ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినం అని చెబుతూ.. కేంద్రం ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదిలాఉంటే.. 40 శాతం కమషన్‌ సీఎం అంటూ మరికొన్ని ప్లెక్సీలు వెలిశాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంట్రాక్టులు, ఉద్యోగాల కోసం కమిషన్లు తీసుకుంటున్నారంటూ ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలను ప్రస్తావిస్తూ వెలసిన ప్లేక్సీలు ఇప్పుడు కలకం రేపుతున్నాయి. గతంలో కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సమయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్లెక్సీలే వెలిశాయి. ఇప్పుడు అమిత్ షా సభ నేపథ్యంలో రోడ్లపై మరోసారి అలాంటి భారీ ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement