Tuesday, April 30, 2024

బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించిన‌ సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించారు. ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం.. వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 10లో కుమ్రం భీమ్‌ ఆదివాసీ, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవనాలను నిర్మించింది. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. జీ ప్లస్‌ వన్‌ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్‌ హాల్స్‌, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్‌ వంటి ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement