Saturday, May 4, 2024

శ్రీ చైత‌న్య కాలేజీలో 14మందికి క‌రోనా!

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు క‌రోనా, మ‌రో వైపు ఒమిక్రాన్ కేసులు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఓ ఇంటర్మీడియట్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళనకు లోనవుతున్నారు. రెండు రోజులుగా చలి, తీర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు టెస్ట్ చేయగా.. కరోనా నిర్ధారణ అయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. నార్సింగి మున్సిపల్ అధికారులు వెంటనే అప్రమత్తమై కాలేజీలో శానిటేషన్ చేశారు. మిగతా విద్యార్థులను హోం ఐసోలేషన్ లో ఉంచారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్ ను కన్ఫర్మ్ చేసేందుకు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. విద్యార్థుల‌కు క‌రోనా వ‌చ్చింద‌ని తెలియ‌గానే విద్యార్థుల త‌ల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement