Friday, May 3, 2024

వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో ఆ నలుగురు..ఆర్థిక లావాదేవీలే కార‌ణ‌మా..

ఆర్థిక లావాదేవీల వ‌ల్లే మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగింద‌ని వెల్ల‌డ‌యింది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ వేగాన్ని పెంచింది. ఈ మేర‌కు కడప సబ్ కోర్టులో వివేకానంద‌రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి పేరుతో సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై విచారణ జరిగింది. దస్తగిరి వాంగ్మూలం పత్రాలను న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దస్తగిరి వాంగ్మూల పత్రాలను సీబీఐ అధికారులు నేడు న్యాయవాదులకు అందజేశారు. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం…వివేకానంద హత్యలో సునీల్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ లతో పాటు తాను కూడా పాల్గొన్నట్టు వెల్లడించాడు. ఆగస్టు 30న ఈ మేరకు దస్తగిరి ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. ఆర్థిక లావాదేవీల వల్లే వివేకా హత్య జరిగినట్టు దస్తగిరి తెలిపాడు. వైఎస్ వివేకా హత్యోదంతంపై సీబీఐ అక్టోబరు 26న చార్జిషీటు నమోదు చేసింది. చార్జిషీటులో సునీల్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్, దస్తగిరిల పేర్లను పేర్కొంది. కాగా ఈ కేసులో దస్తగిరికి గత నెలలో బెయిల్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement