Monday, May 6, 2024

వైఎస్ కు పులివెందుల.. షర్మిలకు పాలేరు..

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వేగంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల.. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. వైఎస్ఆర్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలా అంటూ షర్మిల అన్నారు. తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఆపలేరని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే ఉమ్మడి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, సన్నిహితులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తొలుత ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులతో ఇప్పటికే పలు సార్లు సమావేశం నిర్వహించారు. గతంలో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ కొన్ని స్థానాలు గెలుచుకోవడంతో ఆమె ఖమ్మంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement