Monday, April 29, 2024

బాగుంది దొరగారి జ్వర రాజకీయం: కేసీఆర్ పై షర్మిల సెటైర్లు

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండడంపై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మోడీని కడుగుతా, తోముతా, దేశంలో భూకంపం తెప్పిస్త అన్న దొరగారు..మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందుకు కలవలేదు? అని ప్రశ్నించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని మోడీకి ఎదురుపడి ఎందుకు అడుగలేదు? అని నిలదీశారు. బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేక పోయారా ? అని షర్మిల అడిగారు.

‘’చీరుతా అన్న చేతులతో నమస్కారం పెట్టలేకపోయారా? పోయినుంటే మోడీ, KCR ఢిల్లీ దోస్తానీ మరోసారి బయటపడుతదని పోలేదా? అందుకే జ్వరం వంక పెట్టుకొని డుమ్మా కొట్టారా? సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి ఈ రోజు యాదాద్రి యాగానికి వెళ్ళారా? బాగుంది దొరగారు మీ జ్వర రాజకీయం” అంటూ షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement