Monday, May 6, 2024

ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’.. స్కూళ్లు బంద్.. ఆంక్షలు ఇవీ..

దేశ రాజధాని ఢిల్లీలో ఒరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉన్నతాధికారులతో కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించారు.

కోవిడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లో భాగంగా కింద అన్ని విద్యా సంస్థలను మూసివేయనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు 20కి పరిమితం చేశారు. ఢిల్లీ మెట్రో, బస్సులలో సీట్ల ఆక్యుపెన్సీని 50%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో వరుసగా రెండు రోజుల పాటు 0.5% కంటే ఎక్కువ పాజివిటీ రేటును నమోదైంది. ఒక వారంలో కరోనా కేసులు 1,500 దాటుతాయి. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉన్నామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్, వెంటిలేటర్ల వినియోగం పెరగలేదని చెప్పారు.

మార్కెట్‌లు, మాల్స్‌లో బేసి-సరి సూత్రాన్ని అమలు చేయనున్నారు. ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల మధ్య తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయితే, నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు అన్ని రోజులు తెరిచి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రెస్టారెంట్లు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు, బార్‌లు మధ్యాహ్నం 12-10 గంటల మధ్య కూడా 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

పాఠశాలలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, బాంకెట్ హాళ్లు, ఆడిటోరియంలు, స్పాలు, జిమ్‌లు మరియు వినోద పార్కులు మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు 100% గ్రేడ్ పని చేయనున్నారు. అయితే, ప్రైవేట్ సంస్థలు మాత్రం 50% సిబ్బందితో ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల మధ్య పని చేయడాలని పేర్కొంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement