కేంద్ర హోంశాఖ సీఆర్ పీఎఫ్ సాయుధ కమాండోల రక్షణని కల్పించింది రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి.ఈ మేరకు యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సిన్హా . కాగా యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు తన నామపత్రాలను సర్పించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ సహా 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి.అధికార ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రకటించింది. ఆమె నేడు నామినేషన్ వేయనున్నారు. పీఎం మోదీ.. ముర్ము పేరును ప్రతిపాదించనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement