Monday, April 29, 2024

భ‌క్తుల‌తో కిట కిట లాడిన – యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి ఆల‌యం

ఆదివారం సెల‌వు కావ‌డంతో యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి ఆల‌యం భ‌క్తుల‌తో పోటెత్తింది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు భ‌క్తులు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అర్చకులు యాదాద్రీశుడికి నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. మండపాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లను చేశారు. మంచినీరు త‌దిత‌ర వ‌స‌తుల‌ను క‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement