Thursday, April 25, 2024

రాంగ్ రూట్ డ్రైవింగ్‌.. యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

తిమ్మాపూర్ (ప్రభ న్యూస్) : క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మొన్న జ‌రిగిన రోడ్ యాక్సిడెంట్‌లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌డిని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించి ట్రీట్‌మెంట్ అందించారు. ప‌రిస్థితి విష‌మించి, ట్రీట్‌మెంట్‌కు అత‌ని బాడీ రెస్పాండ్ కాలేద‌ని, త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డ‌మే కార‌ణ‌మ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అయితే.. ఇవ్వాల ఆ స్టూడెంట్ చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు.

ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తిమ్మాపూర్ మండలం కేంద్రంలో ఈనెల 21న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మండలం పూసల గ్రామానికి చెందిన లంక మనోహర్ (22) తిమ్మాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ శ్రీ చైతన్య కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 21న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన బైక్ పై రాంగ్‌రూట్‌లో తిమ్మాపూర్ వైపు వస్తుండగా.. కరీంనగర్ వైపు వెళ్తున్న మ‌రో బైక్ ను ఢీకొట్టాడు. దీంతో మనోహర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న అతని ఫ్రెండ్స్‌ కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement