Monday, April 29, 2024

బొగ్గు గ‌నుల ప్రైవేటీక‌ర‌ణ‌పై భ‌గ్గుమ‌న్న కార్మికులు.. కేంద్రం దిష్టి బొమ్మల ద‌హ‌నం

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం. ప్ర‌ధాని మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఇవ్వాల టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో కార్మికులు నిర‌స‌న చేపట్టారు. తెలంగాణలోని సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు.

చెన్నూరు నియోజకవర్గం మందమర్రి డివిజన్ పరిధిలోని KK5,కాసిపేట 1,2, KK 1A, KK 1, KKOCP, వర్క్ షాప్ గనుల ప్రైవేటీక‌ర‌ణ నిలిపేయాల‌ని కేంద్ర‌ ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ఆందోళ‌న‌ల‌తో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు, TBGKS నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement