Sunday, May 5, 2024

Omicron: బ్రిటన్ నుండి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నెగిటివ్

దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. ఇప్పటి వరకు 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూశాయి. అయితే ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉండటంతో కలకలం రేపింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆమె నమూనాలను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపారు. తాజాగా ఆ మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకలేదని తేలింది. బ్రిటన్  నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నెగిటివ్ గా తేలింది.

మరోవైపు విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. అయితే, వారి జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది. వీరంతా యూకే, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి హైదరాబాద్​కు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement