Friday, May 3, 2024

Breaking : మ‌హిళా న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య‌- పోలీసుల‌కి లొంగిపోయిన భ‌ర్త‌

ఓ మ‌హిళా న్యాయ‌వాది శివాని కుటుంబ‌క‌ల‌హాల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైదరాబాద్‌లోని చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం అర్జున్‌తో శివాని వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లుగా దంపతులిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదాలతో సతమతమవుతున్న శివాని నిన్న రాత్రి తాము నివాసం ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివాని భర్త అర్జున్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement