Thursday, April 25, 2024

FLASH: బావిలో దూకి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు. రాత్రి ఇంట్లో కుటుంబ కలహాలు జరిగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో తల్లి అనూష, కుమారులు గణేష్ ఏడాదిన్నర కాగా,మరో బాబు మణి వయసు మూడేళ్ళు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement