Friday, April 19, 2024

ఉద్వేగానికి లోన‌యిన ప్ర‌ధాని మోడీ – ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంద‌ని హామీ

ప్ర‌ధాని మోడీ ఉద్వేగానికి లోన‌య్యారు. గుజ‌రాత్ లో ప్ర‌భుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాని మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. ఒక వ్యక్తి తన కుమార్తె డాక్టర్ కావాలనే కల గురించి చెప్పిన సందర్భంలో.. ప్రధాని మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆ వ్యక్తి కూతురు కూడా భావోద్వేగానికి గురైంది. అయూబ్ పటేల్ అనే లబ్దిదారుడితో కూడా మోడీ ముచ్చటించారు. ఈ సందర్భంగా అయూబ్ పటేల్.. తాను దృష్టి లోపం సమస్యతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. అయితే తన ముగ్గురు కుమార్తెలను చదివిస్తున్నానని.. వారి చదువులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని ప్రధాని మోడీకి తెలిపారు. ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారని చెప్పారు.12వ తరగతి చదువుతున్న కుమార్తెకు డాక్టర్‌ కావాలనే కోరిక ఉందన్నారు. దీంతో మోడీ అయూబ్‌తో కలిసి అక్కడికి వచ్చిన అతడి కుమార్తె ఆలియాను.. ఏమి కావాలని కోరుకుంటున్నారని అడిగారు. అప్పుడు ఆమె డాక్టర్ కావాలని అనుకుంటున్నట్టుగా చెప్పి ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి సమస్యను చూసిన తర్వాత డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement