Monday, April 29, 2024

భార్య ఆత్మహత్య.. రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ బలవన్మరణం

ఎస్ఐ, అతని భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జనగామ పట్టణంలోని వెంకన్నకుంటలోని.. తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై శ్రీనివాస్ చనిపోయారు. ఇతను జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు.. అతని భార్య స్వరూప ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది.

వరుసగా జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల వల్లే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. కుటుంబ కలహాల క్రమంలో.. ఈరోజు తెల్లవారుజామున అతని భార్య స్వరూప బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా.. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై శ్రీనివాస్.. తీవ్ర మనోవేదనకు గురై తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement