Friday, May 3, 2024

Breaking: భార్యాభర్తలను రోక‌లిబండ‌తో కొట్టి చంపేసి, పోలీస్ స్టేషన్లో లొంగుబాటు.. పాత క‌క్ష‌లే కార‌ణ‌మా?

జన్నారం, (ప్రభ న్యూస్): మంచిర్యాల‌ జిల్లాలో ఘోరం జ‌రిగింది. పాత క‌క్ష‌ల‌ను దృష్టిలో పెట్టుకున్న ఓ యువ‌కుడు భార్యా భ‌ర్త‌లిద్ద‌రిని రోక‌లిబండ‌తో కొట్టి చంపేశాడు. ఆ త‌ర్వాత డైరెక్ట్‌గా వెళ్లి పోలీసు స్టేష‌న్లో లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి జ‌న్నారం మండ‌లంలో కొద్దిసేప‌టి క్రిత‌మే జ‌రిగింది. మండలంలోని చింతలపల్లికి చెందిన భార్య, భర్తలు జింక లచ్చన్న(58 ), రాజేశ్వరి(56)ని అదే గ్రామానికి చెందిన గూడ సతీష్ రోక‌లి బండ‌తో కొట్టి చంపేశాడు.

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. సతీష్ రోకలిబండతో భార్య, భర్తలిద్ద‌రినీ తలపై కొట్టి హత్య చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయంశమైంది. నిందితుడి సతీష్‌కు.. చ‌నిపోయిన‌ ఆ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా పాత కక్షలున్నట్లు తెలుస్తోంది. వీరు తరచుగా గొడవలు పడుతున్నట్లు సమాచారం. సతీష్ ను వారు రెండు రోజుల క్రితం తిట్టడంతో కక్ష పెంచుకొని అతను పథకం ప్రకారం చంపేసిన‌ట్టు తెలిసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా ఎస్ఐకి చెప్పి లొంగిపోయాడు. స్థానిక సీఐ కరిముల్లా ఖాన్, ఎస్ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement