Tuesday, May 7, 2024

ఐపీఎల్ నెక్ట్స్ సీజ‌న్‌లో ఆర్ సీబి కెప్టెన్ ఎవ‌రు..

ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి య‌మ క్రేజ్‌.. IPL 2022 సూపర్ వేలం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ప్రతి టీమ్ మంచి స‌మ‌ర్థ‌వంత‌మైన కెప్టెన్‌ని సెలెక్ట్ చేసుకోడానికి పోటీప‌డుతుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ సీజన్‌లో RCB ఫ్యాన్స్ కూడా త‌మ కెప్టెన్ ఎవ‌ర‌నే దానిపై ఎదురుచూస్తున్నారు. కాగా, విరాట్ కోహ్లీ స్థానంలో RCB యాజ‌మాన్యం కెప్టెన్‌గా ఎవ‌రిని నియ‌మిస్తుంద‌నే టాపిక్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2022 నెక్స్ట్ సీజన్ కి తమ కెప్టెన్‌గా మనీష్ పాండేని ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. టీమ్ ఇండియాకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా, ఐపిఎల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొదటి భారతీయుడిగా మనీష్ పాండే మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా, ఐపీఎల్ తదుపరి సీజన్‌లో విరాట్ కోహ్లిని ఏ టీమ్ కైవ‌సం చేసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement