ఉదయం నుంచి మండే ఎండలతో భగ్గుమనిపించిన భానుడు.. ఒక్కసారిగా కూల్ అయ్యాడు. సాయంత్రం 6 గంటలదాకా భగభగమన్న వాతావరణం.. ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనం కాస్త ఊరటపొందుతున్నారు. కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ సేద తీరుతున్నారు..
Breaking: ఒక్కసారిగా మారిన వెదర్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం.. సిటీ జనాలకు కాస్త రిలీఫ్!
Advertisement
తాజా వార్తలు
Advertisement