Friday, April 26, 2024

త్వరలో మరో 11ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. మంత్రి కేటీఆర్

త్వరలోనే రాష్ట్రంలో మరో 11 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని కొత్తగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా రాష్ట్రంలో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రూ.వెయ్యి కోట్లతో నాలా డెవలప్ మెంట్ పనులు చేపడుతున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ నగరంలో జరగని మౌలిక వసతుల కల్పన హైదరాబాద్ లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వంద శాతం సీవరేజ్ ట్రీట్ మెంట్ కోసం 31 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement