Friday, April 26, 2024

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తాం.. సబితా ఇంద్రారెడ్డి

ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ… విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి అందరి భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగాణ ఇంత చేస్తున్నా.. కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. చట్టపరంగా మనకు రావాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. దేశాన్ని నడిపించే నేతలు రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement